Saturday, April 27, 2024

AP: షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే..

నందికొట్కూర్ : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నంద్యాల జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి ఊహించని షాక్ తగిలినట్లు అయింది. ఆర్థర్ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల సమక్షంలో కండువా కప్పుకున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నందికొట్కూరు వైసీపీ టికెట్ డా.దారా సుధీర్ కు కేటాయించిన సంగతి విదితమే. షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మొదటి నుంచి ఆయన పార్టీపై కినుక వహించారు. ఆది నుంచి ఆర్థర్ వైసీపీని వీడి పార్టీ మారనున్నారని ప్రచారం జరిగింది. ఊహించిన విధంగానే ఆయన పార్టీ మారి కాంగ్రెస్ లో చేరడం గమనార్హం. నందికొట్కూరు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థర్ పోటీ చేసే అవకాశం లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement