మహిళా మంత్రులు సీఎం జగన్ కి రాఖీలు కట్టారు. అనంతరం వారు స్వీట్స్ ని జగన్ కి తినిపించారు.కాగా జగన్ కి రాఖీలు కట్టిన వారిలో మంత్రులు తానేటి వనిత, విడదల రజనితో పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి ఉన్నారు. ఏపీ సీఎం జగన్కు బ్రహ్మకుమారీలు కూడా వచ్చి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలకు సీఎం జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ట్విట్టర్ ద్వారా ‘రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు రాఖీ శుభాకాంక్షలు‘ తెలిపారు. జగన్ కి మంత్రులు..బ్రహ్మకుమారీలు రాఖీ కట్టినట్లు కూయాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సీఎంవో అధికారులు వెల్లడించారు.ఈ మేరకు జగన్ కి రాఖీ కడుతున్న ఫొటోని పోస్ట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement