Wednesday, May 1, 2024

మహీంద్రా నుంచి మార్కెట్‌లో కొత్త బోలెరో..

మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ సరికొత్త బోలెరో మ్యాక్స్‌ పిక్‌-ఆప్‌ వ్యాన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. రవాణా, లాజిస్టిక్స్‌ అవసరాలను తీర్చేలా దీన్ని తీర్చిదిద్దారు. దీని ప్రారంభ ధర 7,68,000 రూపాయలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకర్షనీయమైన ఫైనాన్స్‌ స్కీమ్స్‌తో 25 వేల రూపాయల డౌన్‌ పేమెంట్‌తో ఈ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ వ్యాన్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్జాన్ని పొందుపరిచారు.

ఐ మ్యాక్స్‌ టెలిమ్యాటిక్స్‌ సొల్యూషన్‌ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రీమియం డిజైన్‌, నూతన ఫ్రంట్‌ గ్రిల్‌, హెడ్‌ల్యాంప్లు, డిజిటల్‌ క్టస్టర్‌తో ప్రీమియం డ్యాష్‌బోర్డు వంటి సదుపాయలు ఇందులో ఉన్నాయి. ఎత్తు సరిచేసుకునే డ్రైవర్‌ సీటు, మెరుగైన లెగ్‌రూమ్‌ కోసం సర్టిఫైడ్‌ డీప్లస్‌ 2 సిటింగ్‌, టర్న్‌ సేఫ్‌ లైట్స్‌ వంటివి ఉన్నాయి. 13 వందల కేజీల బరువును ఇది లాగుతుంది. మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వారెంటీ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement