Thursday, May 16, 2024

విద్యుత్ షాక్ తో మహిళ మృతి..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి మిద్దె పై నుంచి కిందకు వస్తున్న వర్షం నీటిని నిలువ ఉంచుదామని ఆశపడ్డ గృహిణిని మృత్యువు వెంటాడింది.. వర్షం జోరుగా కురుస్తుండగా బిందె నిండా నీళ్లు తెస్తామని వెళ్లిన భానుప్రియ (32) కు మిద్దె పైనుంచి కిందకు వేలాడుతున్న వైరుతో విద్యుత్ షాక్ కొట్టింది. అంతే క్షణాల్లో భానుప్రియ మృతిచెందింది.

రాచప్ప కుంట ప్రాంతానికి చెందిన పూజారి నరసింహులు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఏడాది వయసున్న కూతురు బర్త్ డే శనివారం ఘనంగా జరుపుకోవడానికి ఇంటిని శుభ్రం చేసి వర్షం నీటిని నిల్వ ఉంచుదామని బయటికి వెళ్లిన భార్య భానుప్రియ కళ్ళముందే చనిపోవడం చూసి తట్టుకోలేక ఎక్కిఎక్కి ఏడుస్తున్నాడు భర్త నరసింహులు. ఈ విషాద ఘటన చూసిన వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement