Sunday, May 19, 2024

AP: బ‌రిలో ఉంటా.. ర‌ఘురామ ధీమా

ఏపీలో జ‌రుగ‌నున్న ఎన్నిక‌ల బ‌రిలో తాను ఉంటాన‌ని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇవాళ విజయవాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ అమ్మవారిని దర్శనం చేసుకోవడం, పంచహారతులలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఒకటి రెండు రోజుల్లో కూటమి అభ్యర్థిగా త‌న‌ను ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకటించిన వెంటనే త‌న నియోజకవర్గంలో తాను పర్యటిస్తానన్నారు. చంద్రబాబు కచ్చితంగా గెలుస్తారు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు.

పెన్షన్ల విషయంలో పెన్షనర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. 1,50,000 మంది సెక్రటేరియట్ సభ్యులు ఉన్నారు.. ఒక్కొక్క వ్యక్తికి 50గృహాలు అప్పజెప్తే ఒక్క రోజులో వారందరూ పెన్షన్ ఇచ్చేస్తారన్నారు. ఒక్క‌ పోస్ట్ మెన్ రోజుకి ఎన్ని ఉత్తరాలు ఇస్తున్నాడో తెలుసుకోవాలన్నారు. కావాలనే పెన్షన్ దారులను ఇబ్బందుల‌కు గురిచేసి, దాన్ని చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేసే ప్రయత్నం చేశారన్నారు. ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతూ పెన్షన్ తీసుకున్నారో వారందరి ఉసురు కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement