Monday, April 29, 2024

Crime: భర్తను నరికి చంపిన భార్య

నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గుండంపాడులో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భార్య భర్తను హతమార్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సిరివెళ్ళ ఎస్ఐ శరత్ వెల్లడించిన వివరాలు ప్రకారం.. గుండం పాడు కు చెందిన సత్య రాజు (70 ) ఆయన భార్య సరోజ మధ్య తరుచూ కుటుంబ కలహలున్నాయి. వీరికి నలుగురు ఆడ పిల్లలు ఉండగా, వారందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. అయినప్పటికీ ఇద్దరి తరచూ గొడవలు పడుతూ ఉందేవారు. ఈ క్రమంలో ఉదయం ఇద్దరు ఘర్షణ పడగా సరోజ ఇoట్లోని కొడవలి తీసుకుని భర్తను నరికి చంపింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సత్యరాజు ఇంటి ముందే కుప్పకూలి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement