Wednesday, May 15, 2024

వివేకా హ‌త్య‌పై సీఎం జ‌గ‌న్ ఎందుకు మాట్లాడ‌డం లేదు ? : బోండా ఉమ‌

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు మాట్లాడడంలేదని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ….. వైసీపీ నేతల ప్రమేయం సాక్ష్యాలతో బయట పడినా.. అడ్డంగా దొరికినా.. తేలుకుట్టిన దొంగల్లా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని ఉమ‌ విమర్శించారు. అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు మూడేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. వివేకా హత్య కేసు వివరాలను సీబీఐ సగమే మాత్రమే వెలికితీసిందన్నారు. కరుడుగట్టిన నేరగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement