Wednesday, May 15, 2024

AP: షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆమె వెంటే.. ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైతెపా అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌కు వెళ్లేది నిజమైతే.. తానూ ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి, వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ… తాను ఏ పార్టీలో ఉంటానననేది కాలం నిర్ణయిస్తుందన్నారు. వైసీపీకి తాను ఎంత సేవ చేశానో తనకు తెలుసన్నారు. తాను సర్వస్వం పోగొట్టుకున్నానన్నారు. తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానన్నారు. తాను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినన్నారు. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానన్నారు. తాను షర్మిలను కలిశాను.. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా.. అప్పుడు తన నిర్ణయం ఉంటుందన్నారు. వైసీపీకి సిద్దాంతాలు ఉండాలన్నారు. ఎంచుకున్న అభ్యర్థులను ఒడించాలంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధినీ కోరుకుంటున్నారన్నారు. రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.120 కోట్లను మాత్రమే కేటాయించారన్నారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించానన్నారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదన్నారు.

కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తెచ్చినా తాను సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగానన్నారు. స్వయంగా తానే 8కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానన్నారు. తన సొంత డబ్బుతో ఎంటీఎంసీ, దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేశామన్నారు. లోకేష్ ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా అన్నారు. తాను ఎవరిని నిందించడం లేదన్నారు. తనకు ధనుంజయ రెడ్డి చాలా సార్లు మేసేజీలు పెట్టారు.. నిధులు మంజూరు చేస్తానన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినా.. ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారని అన్నారు. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టమన్నారు. తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చానన్నారు.


మంగళగిరి ప్రజలకు తాను దూరంగా ఉండనన్నారు. ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తాను ఏ పార్టీలో చేరినా ఆరోజు తన నిర్ణయం చెప్తానన్నారు. ఉంటే వైసీపీలో ఉంటానని చెప్పా.. ఇప్పుడు వైసీపీ వీడానన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. చాలా మంది తనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారన్నారు. తాను వైఎస్ కుటుంబంతో ఉన్నానని.. ఉంటానని చెప్పారు. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకోనని చెప్పారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నా.. షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినా తన పోరాటం ఆగదన్నారు. సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పా.. తప్పు ఎవ్వరూ చేసినా తప్పేనన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడనన్నారు. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయ స్థానాలు తేలుస్తాయన్నారు. తాను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదన్నారు. తనకు జగన్ టికెట్ ఇవ్వలేదని తాను పార్టీని వీడలేదన్నారు. తనకు, చిరంజీవికి, జగన్ కు మధ్య ఏమి జరిగింది అనేది తమ అందరికీ తెలుసని, తాను టికెట్ లేదని పార్టీని వీడలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement