Thursday, May 2, 2024

అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా..

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి ఆదేశాల మేర‌కు ఏలూరు, జంగారెడ్డి గూడెం పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల‌ సిబ్బంది రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ కొరకు గస్తీ నిర్వహించారు. బస్ స్టాండ్ లాడ్జిలలో తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికలపై నిఘా ఉంచారు. రహదారి ప్రమాదాల నివారణ కొరకు రాత్రిపూట వాహనదారులకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రార్ధనాలయాలు వద్ద మారుమూల ఉన్న మద్యం దుకాణాల వద్ద ఏవిధమైన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తుగా రాత్రి పూట అక్కడ ఏర్పాటు చేసిన వాచ్ మెన్ లకు అధికారులు బ్రీఫింగ్ చేశారు. వాహనాలలో గంజాయి, నాటు సారాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిషేధించిన గుట్కా, ఖైని పదార్థాలు అక్రమ రవాణా జరగకుండా నేషనల్ హైవే, స్టేట్ హైవే ఇతర మార్గాలలో వాహన తనిఖీలు నిర్వహించినారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement