Sunday, April 28, 2024

Eluru: రోడ్డు ప్రమాదంలో ఒక‌రు మృతి

దెందులూరు, ప్రభ న్యూస్ : ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ.. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే… ఏలూరు జిల్లా ఏలూరు నుండి కొవ్వలి వెళుతుండగా రూరల్ మండలం మల్కాపురం వద్ద గోపి అనే వ్య‌క్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.

గాయాలపాలైన గోపి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement