Sunday, April 28, 2024

AP: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా డీవీఆర్ కే చౌదరి

దెందులూరు, ప్రభ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా దెందులూరుకు చెందిన డీవీఆర్ కే చౌదరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ స్థానం కల్పించింది. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… త‌నకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చినందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖ‌ర్గేకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ కి, సి డబ్ల్యూ సి మెంబర్ డాక్టర్ రఘువీరా రెడ్డికి, సి డబ్ల్యూ సి మెంబర్ గిడుగు రుద్రరాజుకి, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ తులసి రెడ్డికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement