Thursday, May 2, 2024

అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని మృతి

ఏలూరు : ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు వైఎస్ఆర్ కాలనీకి చెందిన కలిపిండి మేఘన (23) రామచంద్ర కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. మేఘ‌న తండ్రి తాపీ మేస్త్రీగా ప‌నిచేస్తున్నాడు. తల్లిదండ్రులు ఆదివారం రాట్నాలకుంటలో ఫంక్షన్ కు వెళ్లి తిరిగి ఇంటికొచ్చేసరికి మేఘన నిర్జీవంగా పడి ఉంది. మెడ చుట్టూ చున్నీ బిగించి ఉంది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విద్యార్థిని మృతికి కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి పరిశీలించారు. రూరల్ సీఐ ఆది ప్రసాద్ ఆదేశాల మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లక్ష్మణబాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement