Monday, April 29, 2024

యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు న్యాయవాదుల య‌త్నం

కర్నూల్ లో బెంచ్ వద్దు.. హైకోర్టు ముద్దు అంటూ కొంతమంది న్యాయవాదులు స్థానిక ఎస్వి కాంప్లెక్స్ ఎదుట నిరసన చేపట్టారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత న్యాయవాదులపై లోకేష్ ఫైర్ అయ్యారు. హైకోర్టు తెస్తానంటూ మాటిచ్చి మోసం చేసిన జగన్ ఇంటి ముందు నిరసన తెలపాలని సూచించారు. బుగ్గన బెంగుళూరు వెళ్లి విశాఖలో హై కోర్టు అన్నారు. సుప్రీం కోర్టులో అమరావతిలోనే హైకోర్టు అని అఫిడవిట్ వేశారు. వైసిపి న్యాయవాదులు నిరసన చేయాల్సింది జగన్ ఇంటి ముందు నా ముందు కాదు అంటూ లోకేష్ సలహా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement