Wednesday, May 1, 2024

మహిళపై దుండగుల యాసిడ్‌ దాడి

ఏలూరు, ప్రభ న్యూస్ (క్రైమ్) : ఏలూరు నగరానికి చెందిన ఓ మహిళ శరీరంపై గుర్తు తెలియని దుండ‌గులు యాసిడ్ దాడి చేశారు. వెంటనే చికిత్స నిమిత్తం హుటాహుటిన ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనా వివరాలు సేకరిస్తున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం మ‌హిళ‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement