Sunday, May 5, 2024

న‌కిలీ క‌రెన్సీ గుట్టు ర‌ట్టు..పోలీసుల అదుపులో నిందుతులు..

న‌కిలీ క‌రెన్సీని చ‌లామ‌ణి చేస్తోన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా బుట్టాయిగూడెంలో న‌కిలీ క‌రెన్సీ గుట్టు ర‌ట్ట‌యింది. కాగా జంగారెడ్డిగూడెం..పోల‌వ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో ఓ ముఠా దొంగ‌నోట్ల‌ని చ‌లామ‌ణి చేస్తోంది. వారి వ‌ద్ద నుంచి రూ. 12ల‌క్ష‌ల న‌కిలీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటితో పాటు మూడు బైక్ లు..నాలుగు సెల్ ఫోన్ల‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌పై 489బి,489సి, ఆర్ బై డ‌బ్ల్యూ34 ఐపీసీ సెక్ష‌న్ల కింద కేసుని న‌మోదు చేశారు. న‌కిలీ క‌రెన్సీ విష‌యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఎస్పీ రాహుల్ దేవ్ శ‌ర్మ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement