Thursday, April 25, 2024

‘క్విట్ చంద్రబాబు’ ఈ నినాదంతోనే ఈసారి ఎన్నికలకు వెళ్తాం: మంత్రి రోజా

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమ్​ ఉంది. కానీ, అప్పుడే అన్ని పార్టీల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి అంతా ఇప్పుడు ఏపీలోనే కనిపిస్తోంది. తాజాగా మంత్రి ఆర్​కే రోజా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘క్విట్ చంద్రబాబు.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని కామెంట్​ చేశారు రోజు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న కడపలో, ఇవ్వాల కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, వైసీపీ పాలనపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ… కుప్పంలో జరిగిన అభివృద్ధి, పులివెందులలో జరిగిన అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను గమనించాలని చెప్పారు.

చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి రోజా అన్నారు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పటికీ కుప్పంను కనీసం రెవెన్యూ డివిజన్ గా కూడా చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తాము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నామని… టీడీపీ నేతలు మీడియా ముందు డ్యాన్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇవ్వాల ఉదయం మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవరాయలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement