Tuesday, April 30, 2024

VZNM: గత ప్రభుత్వం కన్నా తక్కువ అప్పులే చేశాం.. ఆర్థిక మంత్రి బుగ్గన

విజయనగరం : గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వ అప్పులు తక్కువే చేసిందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. విజయ నగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ… దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్కిటెక్చ్యురల్ బోర్డ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతిపక్ష పార్టీలకు తమకి నచ్చిన విధంగా ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని వాళ్లు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుండి గతంలో ఎన్నడూ లేనంతగా నిధులు తెచ్చి కనీవినీ ఎరగని పనులు చేశామన్నారు. అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తాయన్నారు. కేవలం ఏపీ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు అబద్ధాలు చెప్తున్నారన్నారు. గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఉన్నా రాష్ట్రానికి నిధులు తీసుకురాలేక పోయారన్నారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడే ఎక్కువ నిధులు తెచ్చామన్నారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement