Tuesday, May 7, 2024

మాచ‌ర్ల‌లో ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రుపుతున్నాం.. డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి

మాచ‌ర్ల‌లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. దాంతో అక్క‌డి ప‌రిస్థితులు మ‌రింత చేజార‌కుండా ఉండేందుకు పోలీసులు 144సెక్ష‌న్ విధించారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మాచర్లలో అదనపు బలగాలను మోహరించినట్టు చెప్పారు. ఐజీ త్రివిక్రమ్ ను మాచర్లకు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు.

శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. మాచర్ల టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి నివాసం, పార్టీ కార్యాలయం, వాహనాలకు దుండగులు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement