Sunday, April 28, 2024

Tirumala: మోకాళ్లపై నడుస్తూ తిరుమల కొండకు.. సినీ హీరోయిన్​ నందిని భక్తికి అభినందనలు

తిరుమల తిరుపతిలోని శ్రీవారి దర్శనానికి రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వారిలో చాలామంది కాలినడక వచ్చేవారు, కొంతమంది వాహనాల్లో వచ్చి వీఐపీ దర్శనాలు చేసుకుంటారు. అయితే.. కొంతమంది మాత్రమే తమ కఠినమైన మొక్కు తీర్చుకునే యత్నం చేస్తుంటారు. అందులో సినీరంగానికి చెందిన ఓ హీరోయిన్​ ఇట్లా మోకాళ్లపై మెట్లు ఎక్కి శ్రీవారి చెంతకు చేరుకున్నారు.

బిగ్​బాస్​ ఫేమ్​ నందిని రాయ్​ ఏడుకొండలపై మోకాళ్లపై నడుస్తూ వచ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోని సోషల్​ మీడియాలో పోస్టు చేస్తూ.. ఎంతో కష్టపడి మెట్లు ఎక్కినప్పటికీ, చాలా మంచి అనుభూతి పొందానని తెలిపింది. అయితే.. ఈ వీడియో చూసిన చాలామంది నందిని రాయ్​ భక్తిని అభినందిస్తున్నారు. తన కోరికలు ఆ ఏడుకొండల స్వామి తప్పకుండా నెరవేరుస్తాడని దీవెనలు కూడా అందిస్తున్నారు. మరి ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేసిన వీడియోను మీరూ ఓ సారి చూడండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement