Sunday, April 28, 2024

Vizianagaram – జాయింట్ క‌లెక్ట‌ర్ గా బాధ్యతలు స్వీకరించిన కార్తీక్

విజయనగరం, జనవరి 31 (ప్రభ న్యూస్): జిల్లా జాయింట్ కలెక్టర్ గా కొల్లాబత్తుల కార్తీక్ బుధవారం బాధ్యత స్వీకరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పనిచేసిన ఆయన విజ‌య‌న‌గ‌రం జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జెసి కార్తీక్ కు వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై దృష్టి పెడతానని చెప్పారు. ముఖ్యంగా విజయనగరం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియోజకవర్గం పై దృష్టి సారిస్తానని, ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు. రెవెన్యూ అంశాలతో బాటు అసైన్ భూముల క్రమబద్దీకరణ, నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు, కౌలు రైతులకు రుణాలు, పంట కోత ప్రయోగాలు మొదలగు అంశాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి వేగవంతం చేస్తామన్నారు. అనంతరం రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక తదితర శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఆయా శాఖల ప్రగతిపై జెసి చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement