Monday, April 29, 2024

MBNR: వంశీచందర్ రెడ్డి న్యాయాయాత్ర…. వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

మక్తల్, జనవరి31(ప్రభన్యూస్): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రస్ఫూర్తితో మాజీ ఎమ్మెల్యే సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు చల్ల వంశి చందర్ రెడ్డి పాలమూరు పునర్జీవం కోసం పేరిట పాలమూరు న్యాయాయాత్ర పేరుతో చేపట్టిన 25 రోజుల పాదయాత్ర ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల కేంద్రం నుండి ప్రారంభమైంది.

మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి, డిసిసి అధ్యక్షులు కే. ప్రశాంత్ కుమార్ రెడ్డిలో జెండా ఊపి వంశీచందర్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. కృష్ణ మండల కేంద్రం నుండి ప్రారంభమైన పాదయాత్ర హిందూపూర్, కున్సి మీదుగా కొనసాగుతోంది. ఈ యాత్రలో జెడ్పి చైర్పర్సన్ కే .వనజ ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, జి. గోపాల్ రెడ్డి, జి. లక్ష్మారెడ్డి ,జి. రవికుమార్ యాదవ్, రాజప్ప గౌడ, ఆనంద్ గౌడ్ ,బోయ రవికుమార్, గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మాగనూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కృష్ణ మండల కేంద్రంలోని శ్రీ క్షీర లింగేశ్వర స్వామి మఠంలో వంశీచందర్ రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement