Friday, April 26, 2024

Breaking: విశాఖలో రింగు వలల వివాదం.. మత్స్యకారుల మధ్య వాగ్వాదం

విశాఖలో రింగు వలల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. విశాఖలోని పెద్ద జాలరి పేట గంగమ్మ తల్లి గుడి వద్ద ఉద్రికత్త నెలకొంది. సముంద్రం మధ్యలో మత్స్యకారుల ఘర్షణకు దిగారు. రింగ్ వలలపై వేటకి సిద్ధమవుతున్న మత్స్యకారులను పెద్ద జాలరిపేట మత్స్యకారులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా, రింగువలలపై కొంతకాలంగా జాలర్ల మధ్య వివాదం కొనసాగుతోంది. చేపల ఉత్పత్తి తగ్గుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రత తెలిపినా అధికారుటు పట్టించుకోవడం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement