Monday, May 13, 2024

వివేకా హ‌త్య కేసు విచార‌ణ మార్చి 10కి వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచార‌ణ మార్చి 10వ‌తేదీకి వాయిదా ప‌డింది. ఈ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితులు సునీల్‌ యాదవ్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరితో పాటు మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని కడప జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇవాళ నగరంలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ ప్రారంభించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది. నిందితుల్లో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ ఇప్పటికే కడప జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉండటంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement