Saturday, April 27, 2024

Vishakha – మధురవాడ లో దారుణం..! లైంగిక వేధింపులతో చైతన్య విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

వాట్సప్ చాటింగ్ తో సూసైడ్ నోటు
లైంగిక వేధింపులు గురై మనస్తాపం తో ఆత్మహత్య
కళాశాల మేడ పై నుండి దూకి పడిపోయిన విద్యార్థిని
కీచ‌కులుగా ఫ్యాక‌ల్టీ స‌భ్యులు

విశాఖ క్రైం : ప్రభ న్యూస్ – విశాఖ మధురవాడ కొమ్మది లో విద్యార్థినిపై దారుణ లైంగిక వేధింపుల సంఘటన మళ్లీ చోటు చేసుకుంది.ఈ లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య కు దారితీసింది. ఈ సంఘటన సంచలనం రేపింది. ఇటీవల కాలంలో వరుసగా విశాఖ మధురవాడలో ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్యలు,అత్యాచారాల సంఘటనలు నిత్య కృత్యంగా మారాయి. ఇటీవల ఒక విద్యార్థిని పై పిటి మాస్టర్ అత్యచారం సంఘటన మరవకముందే తాజాగా మరో సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
మధురవాడ ఒక విద్యాసంస్థలో దారుణ లైంగిక వేధింపుల సంఘటన మళ్లీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.ఈ తీవ్ర లైంగిక వేధింపుల సంఘటనలో తన కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదని ఒక అమాయక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకుంటూ ముందుగా వాట్సప్ చాటింగ్ ద్వారా సూసైడ్ నోట్ రాసింది. తనకు జరిగిన లైంగిక వేధింపుల సంఘటనలో తాను చదువుకుంటున్న కాలేజీలో విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఫ్యాకల్టీ విద్యార్థులతో చేతులు కలిపి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొంది. తనలాగే అనేకమంది మహిళా విద్యార్థులు లైంగిక వేధింపులకు నిత్యం బలి అవుతున్నారని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రహస్యంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ఆ విద్యార్థిని కుటుంబ పరువును బజారుకీడుస్తామని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థిని సూసైడ్ నోట్ లో పేర్కొంది.

ఈ ఘటన ఒక్కసారిగా వెలుగు చూడడం తో విద్యార్థులు,తల్లిదండ్రులు బయన్దోళనలు గురయ్యారు. పాఠాలు నేర్పించవలసన విద్య బుద్దులే కీచకనికి ఒడిగట్టడం తో తల్లిదండ్రుల్లో తమ పిల్లలు పై ఆందోళన మొదలియింది.మృతురాలు తనకు జరిగిన బాధ ను తన తల్లిదండ్రులకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించి శుక్రవారం తెల్లవారుజామున కళాశాల బిల్డింగ్ పై దూకి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు! మృతి రాలు తల్లిదండ్రులు తన కుమార్తె ను దారుణంగా కళాశాల యాజమాన్యమే హత్య చేశారని ఆరోపణ చేస్తున్నారు.దీనిపై పీఎంపాలెం సిఐ రామకృష్ణ దర్యాప్తు వేగవంతం చేసారు.యాజమాన్యం పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు! కాగా, మృతురాల మొబైల్ సీజ్ చేసి డేటా స్వీకరించినట్లు తెలుస్తోంది!మృతురాలు కాల్ డేటా వస్తే అసలు కథ ఏంటి అనేది తెలియాల్సి ఉంది!

విద్యార్థి మృతి పై మహిళ సంఘాలు ధ్వజం

మహిళలు, విద్యార్థిని చిన్నారులపై అఘాయిత్యాలు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని వారిని కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ బాధితులకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. విశాఖలోనే ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. కేసులు నమోదు చేసి అరెస్టులు చేసినప్పటికీ వారిలో మార్పు రావడం లేదని అంటున్నారు. చిన్నారులపై, మైనర్ బాలికలపై, మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొంటున్నారు.
ప్రభుత్వాలు ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. విద్యార్థిని రూప శ్రీ లైంగిక వేధింపులు ఘటన దారుణమని వెంటనే కళాశాల యాజమాన్యం ను అరెస్టు చేయాలని పీఎంపాలెం పోలీసులను కోరారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళ పై లైంగిక దాడులు జరగకుండా అడ్డుకునేందుకు కఠినమైన చట్టాలను, శిక్షలను తీసుకు రావాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement