Thursday, April 25, 2024

Protest – అనంతలో భ‌గ్గుమన్నఅస‌మ్మ‌తి …టిడిపి కార్యాల‌యం బుగ్గి

నిప్పుపెట్టిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు
చంద్ర‌బాబు ఫ్లెక్సీలు అగ్నికి ఆహుతి
టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణ
గుంతకల్లులోనూ నిర‌స‌న గ‌ళం.

అనంతపురం, మార్చి (29 ప్రభాస్ బ్యూరో ) – అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్ కు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద చేరుకుని సామాగ్రిని బయట వేసి నిప్పు అంటించారు. టికెట్లను 30 కోట్లకు అమ్ముకున్నారని చంద్రబాబు, లోకేష్ పై ఆరోపణలు చేశారు. కార్యాలయంలో ఫర్నిచర్, ఫ్లెక్సీలు బయటికి తీసుకొచ్చి నిప్పు పెట్టారు. అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు.చంద్రబాబు ఫ్లెక్సీలు చించివేసి నిరసన తెలిపారు చంద్రబాబు ఫోటోలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో కార్యకర్తలు విరుచుకుపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు.

నిరసన కార్యక్రమంలో స్పృహ కోల్పోయిన ఒక మహిళా కార్యకర్తకు స్థానికంగా వైద్యం చేసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రభాకర్ చౌదరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టుకున్నారు. అయితే దగ్గుపాటి ప్రసాద్ ఏమాత్రం పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇదేవిధంగా గుంతకల్లులో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కు టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్చార్జ్ జితేందర్ గౌడ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగి పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement