Monday, May 6, 2024

Visakhapatnam – గంగవరం పోర్టు కార్మికుల బంద్ …తీవ్ర‌ ఉద్రిక్తత

విశాఖ: గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్‌’ ఉద్రిక్తతకు దారి తీసింది. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ నేపథ్యంలో గేటుకు ఇరువైపులా పోలీసులు భారీ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పోర్టు కార్మికులు కంచెను దాటుకుని తమ కుటుంబాలతో కలిసి ముట్టడికి యత్నించారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు, పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంద‌ర్భంగా ప‌లువురిని అరెస్ట్ చేశారు.. ఈ బంద్ కు అన్ని పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement