Friday, May 17, 2024

Visakhapatnam : ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్.. ప‌లు రైళ్లు ర‌ద్దు

గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ఈ సంఘ‌ట‌న విశాఖ జిల్లా తాడి..అన‌కాప‌ల్లి మ‌ధ్య చోటు చేసుకుంది. దీంతో విశాఖ పట్టణం- బెజవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నేడు ఉదయం 3:35 గంటలకు బొగ్గు లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బోగీలు పట్టాలు తప్పడంతో పూర్తిగా ట్రాక్ దెబ్బతింది. దీంతో జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు మూడు గంటల పాటు ఆలస్యంగా నడుస్తుంది. ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు రైల్వే అధికారులు. ట్రాక్ పునరుద్దరించిన తర్వాత ట్రాక్ పైకి గూడ్స్ రైలుకు తీసుకువచ్చారు రైల్వే శాఖాధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement