Monday, April 29, 2024

అర్హులంద‌రికీ ఇళ్ల ప‌ట్టాలు అందిస్తాం : ఎమ్మెల్యే చిన్న‌య్య‌

బెల్లంపల్లి (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణం రెండో వార్డు గ్రౌండ్ బస్తీలో సింగరేణి, ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇళ్ల పట్టాల‌ను బుధవారం అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెల్లంపల్లి ప్రజల చిరకాల కోరిక అయిన పట్టాల పంపిణీ కోసం అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడ‌డం జ‌రిగింద‌న్నారు.

గత 60 ఏళ్లుగా బెల్లంపల్లిలో నివాస‌ముంటున్న వారికి పట్టాలు అందజేయడం జరుగుతుంద‌న్నారు. ఈ పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 వరకు సమయం ఉందన్నారు. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, స్థానిక కౌన్సిలర్ అప్సర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement