Saturday, May 4, 2024

Breaking: క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ భేటీ

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల భ‌ర్త‌ బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ ఏపీలోని విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. విశాఖలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ భేటీ అయ్యారు. విశాఖలోని మేఘాలయ హోటల్‌లో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశం నిర్వ‌హించారు. అయితే ఇటీవ‌లే బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ త‌ర్వాత బీసీ, ఎస్సీ నేత‌ల‌తో స‌మావేశమైన విష‌యం విదిత‌మే. అయితే ఈరోజు విశాఖ‌లో క్రైస్త‌వ సంఘాల నేత‌ల‌తో స‌మావేశ‌వ‌డంతో రాజకీయ పార్టీ పెడతారన్న ప్రచారంతో భేటీకి ప్రాధాన్యత సంత‌రించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement