Tuesday, April 23, 2024

వైభవంగా సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆది వారం సాయంత్రం ప్రారంభ మయ్యా యి. విద్యుత్‌ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్ప పై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేల సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శన మిచ్చారు. ముందుగా సాయం త్రం 6 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేల సమేత శ్రీరామ చంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగుమాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు సీతాలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్ప పై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement