Saturday, May 4, 2024

AP: వైయస్ షర్మిలకు వైరల్ ఫీవర్.. అనంత పర్యటన వాయిదా

అనంతపురం, ఫిబ్రవరి 5 ( ప్రభ న్యూస్ బ్యూరో) : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు వైరల్ ఫీవర్ కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గడచిన కొన్ని రోజులుగా షర్మిల తీరిక లేకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సోమవారం మడకశిర బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. మంగళవారం అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వ‌హించాల్సి ఉంది. సహాపంక్తి భోజనం, కూలీలతో ముఖాముఖి స‌మావేశం నిర్వ‌హించాల్సి ఉంది.

అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, విభజన హామీలను జనంలోకి తీసుకెళ్లే విధంగా షర్మిల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం కార్యక్రమాన్ని నిర్వ‌హించాల్సి ఉంది. అయితే ఆమె అనారోగ్య కారణాల వల్ల కార్యక్రమం రద్దయినట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. త్వరలో మళ్లీ పర్యటన తేదీని ఖరారు చేస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement