Sunday, April 28, 2024

AP| వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా మల్లాది విష్ణు

విజయవాడ, (ప్రభ న్యూస్): విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బొప్పన భవకుమార్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆయన స్థానంలో మల్లాది విష్ణుకు నగర పార్టీ బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్పగించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీ బొండా ఉమామహేశ్వరపై విష్ణు గెలుపొందారు. అనంతరం ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మల్లాది విష్ణు ఇకనుండి వైసీపీ నగర పార్టీ అధ్యక్షుడుగా కూడా కొనసాగునున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement