Friday, May 17, 2024

ఉపరాష్ట్రపతి వెంకయ్యకి ఘనస్వాగతం.. ఏపీలో వారం రోజులు పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ చేరుకున్నారు. విజయవాడగన్నవరం ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టకి ఉపరాష్ట్రపతి వెళ్లారు. నేటి నుంచి వారం రోజుల పాటు పలు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement