Monday, April 29, 2024

Breaking: రాజ్య‌స‌భ ప్యాన‌ల్ వైస్ చైర్మ‌న్‌గా విజ‌య‌సాయి.. నియమించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

రేపటి నుంచి పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ‌ ప్యాన‌ల్ వైస్ చైర్మ‌న్‌గా ఎంపిక‌య్యారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యసభను నడపనున్నట్టు సమాచారం. రాజ్యసభ వైస్ చైర్మన్‌ నూతన ప్యానల్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అవకాశం దక్కింది. తాజాగా రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పునర్మించారు.

దీనిలో భాగంగా విజయసాయిరెడ్డికి ప్యానల్‌లో చోటు లభించింది. రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌లో విజయసాయిరెడ్డితో పాటు భువనేశ్వర్‌ కలిత, ఇందు బాలగోస్వామి, హనుమంతయ్య, తిరుచి శివ, డాక్టర్‌ సస్మిత్‌ పాత్రలకు సభ్యులుగా చోటు దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement