Monday, April 29, 2024

AP : రెండు రోజుల‌లో టిడిపిలో చేరుతా…వసంత కృష్ణ ప్ర‌సాద్

రెండ్రోజుల్లో తాను టిడిపి లో చేరనున్న‌ట్లు మైలవరం వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఐతవరంలో ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తాన‌ని, ఆయన సమక్షంలో పార్టీలో చేరతాన‌ని చెప్పారు.

మాజీ మంత్రి దేవినేని ఉమతో త‌న‌కు వ్యక్తిగత ద్వేషాలు లేవ‌ని తేల్చి చెప్పారు. స్వ‌ల్ప విభేదాలు ఉన్నా అధిష్ఠానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్నీ మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకుంటామ‌ని తెలిపారు… చంద్రబాబు, లోకేశ్‌ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్‌ చెప్పార‌ని అందుకే ఆ పార్టీలో ఉండలేక బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని చెప్పారు.. వైకాపాలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇది ఇలా ఉంటే మైల‌వ‌రం నుంచి టిడిపి అభ్య‌ర్ధిగా వ‌సంత పోటీ చేయ‌నున్నారు.. ఈ మేర‌కు చంద్ర‌బాబు ఆయ‌న‌కు హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement