Sunday, April 28, 2024

కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయాలి.. సోము వీర్రాజు

ఏపీ పాలిటెక్నికల్ కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయాలని ఆరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆరు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 854 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తుందన్నారు. ప్రభుత్వం ఎవరి సమస్యలనూ పరిష్కరించడం లేదని సోము వీర్రాజు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement