Saturday, May 11, 2024

మంజూరైన ఇల్లు రద్దు చేశారనే మనస్తాపంతో…

నాగాలాపురం (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలో తనకు మంజూరైన ఇంటి పట్టాను రద్దు చేసినందుకు మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం జరిగింది. మండలంలోని సురుటుపల్లె జగనన్న కాలనీలో రేణుబాబు అనే వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా రద్దయ్యింది. తనకి మంజూరు చేసిన పట్టాను ఆకారణంగా వీఆర్ఓ చంద్రశేఖర్ రద్దు చేశారని రేణుబాబు ఆరోపిస్తున్నారు. అదే ఆరోపణతో ఉదయం నాగలాపురం మండల కార్యాలయానికి వచ్చిన అతను తహసీల్దార్ ప్రసన్న కుమార్ ముందే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు‌. సిబ్బంది అప్రమత్తమై అడ్డుకోడానికి యత్నించారు. ఈ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు రేణుబాబును ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement