Monday, April 29, 2024

వివేకా హ‌త్య కేసులో.. అవినాష్ రెడ్డిపై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు : స‌జ్జ‌ల

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై ప్ర‌తిప‌క్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఎన్టీఆర్ మృతికి పరోక్షంగా చంద్రబాబు కారణమని అందరికీ తెలుసన్నారు. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలుండాలన్నారు. వైఎస్ వివేకా లేకపోవడం వైసీపీకి ఎదురుదెబ్బ అని అన్నారు. ఇప్పటికీ వైఎస్సార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడి అపహాస్యం పాలవుతున్నారని చెప్పారు. హార్ట్ ఎటాక్ అని చెప్పినంత మాత్రాన అది దర్యాప్తును ఎలా ప్రభావితం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయని చెప్పారు. సాక్ష్యాలను ఎవరూ తారుమారు చేయలేరన్నారు. తాము సీబీఐ విచారణను మాత్రమే తప్పు పట్టామని సజ్జల చెప్పారు. ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలను సీీబీఐ పట్టించుకోదా ? అని సజ్జల ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు శివప్రకాష్ రెడ్డి సమాచారం ఇచ్చిన మీదటే అవినాష్ రెడ్డి అన్నారు. చంద్రబాబుది కుట్రల స్వభావం అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement