Tuesday, May 21, 2024

AP: నేడు రైళ్లను ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఇవాళ మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించనున్నారు. హుబ్బల్లి-నర్సాపూర్, విశాఖ-గుంటూరు, నంద్యాల-రేణిగుంట రైళ్లకు గుంటూరులో శ్రీకారం చుట్టనున్నారు. ఈ మూడు రైళ్లు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

విశాఖపట్నం-విజయవాడ మధ్య నడుస్తున్న ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ (నం.22701/22702) రైలును గుంటూరు వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వరకు నడుస్తున్న అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (నం.07284/07285) నరసాపురం వరకు పొడిగించినట్లు చెప్పారు. నంద్యాల-కడప వరకు నడుస్తున్న ప్రత్యేక రైలును రేణిగుంట వరకు పొడిగించినట్లు వివరించారు. ఈ పొడిగింపు 13వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

ఉదయ డబుల్‌ డెక్కర్‌ పొడిగింపుతో గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి విశాఖపట్నానికి రాకపోకల సౌకర్యం మెరుగుపడుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపుతో నరసాపురం, భీమవరం ప్రాంతవాసులకు గుంతకల్‌, బళ్లారి, హుబ్బళ్లి వరకు నేరుగా రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుందని.. నంద్యాల-కడప రైలును రేణిగుంట వరకు పొడిగించడంతో నంద్యాల, కడప, చుట్టుపక్కల ప్రాంతవాసులు తిరుమల చేరేందుకు సానుకూలంగా ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement