Monday, April 29, 2024

అల్లుడి చేతిలో మామ హతం.. ఆర్థిక లావాదేవీలే కారణ‌మా?

పొదిలి, (ప్రభన్యూస్): ప్ర‌కాశం జిల్లా పొదిలి మండ‌లంలో ఘోరం జ‌రిగింది. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో అల్లుడి చేతిలో మామ హతం అయిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. హనుమంతునిపాడు మండలం దొడ్డి చింతల గ్రామానికి చెందిన పగడాల హరికృష్ణ రెడ్డి (23) గొట్లగట్టు గ్రామంలో బైక్ మెకానిక్ గా పని చేస్తుంటాడు. అదే గ్రామానికి వరుసకు అల్లుడు కొప్పుల నరేంద్ర రెడ్డి బైక్ మెకానిక్ సహాయకునిగా పనిచేసుకుంటూ ఉండేవాడు. కృష్ణారెడ్డి రోజూ సాయంత్రం దొడ్డి చింతల వెళ్లి వస్తుంటాడు. వారి ఇరువురి మద్య నగదు విషయంలో శుక్రవారం ఉదయం గొడ‌వ‌ జరిగింది.

శుక్రవారం రాత్రి కిృష్ణారెడ్డి బచ్చలికూర పాడు గ్రామంలో పెళ్లికి హాజరై రాత్రి గొట్లగట్టు రూమ్ కి చేరాడు. నిద్ర‌పోతున్న సమయంలో తెల్ల‌వారుజామున కొప్పుల నరేంద్ర రెడ్డి కత్తితో గొంతుపై విచక్షణారహితంగా న‌ర‌క‌డంతో హరికృష్ణ రెడ్డి అక్కడికిక్కడే చ‌నిపోయాడు అని పొలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పొదిలి సీఐ సుధాకర్ బాబు కొనకనమిట్ల ఎస్ఐ ఫణి కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఒంగోలు నుండి క్లూస్ టీమ్‌ ను పిలిపించారు. నమూనాలు సేకరించారు. నరేంద్రరెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement