Monday, April 29, 2024

Missing – ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యం

చిత్తూరు కార్పొరేషన్ సెప్టెంబర్ 3 ప్రభ న్యూస్ – నగరంలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు . సీఐ కథనం మేరకు నగరంలోని శంకరాయిని గుంట కు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నారని, యధా ప్రకారం శనివారం కళాశాలకు వెళ్లి న ఇద్దరు బాలికలు తిరిగి రాకపోవడంతో బంధువులు స్నేహితుల ఇళ్లలో సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి కనిపించకపోవడంతో శనివారం రాత్రి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement