Tuesday, July 23, 2024

భర్తను హతమార్చిన బార్య ..

చెన్నూర్ సెప్టెంబర్3 (ప్రభ న్యూస్) నిత్యం మద్యం సేవించి వేధిస్తున్నాడని విసుగు చెంది తల్లి తో కలిసి భర్తను హతమార్చిన సంఘటన చెన్నూరు పట్టణం కొత్తగూడెం కాలనీలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలం లోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన మడక తిరుపతి (34) కు చెన్నూరు పట్టణం కొత్త గూడెం కాలానికి చెందినసౌందర్య తో గత 12 ఏళ్ళ క్రితం వివాహమైంది. స్థానికంగా బట్టల షాప్ లో పని చేసుకుంటూ బార్య ఇద్దరు పిల్లలతో కొత్తగూడెం లోని తన అత్త లక్ష్మి ఇంట్లో నివాసం ఉంటు జీవనం సాగిస్తున్నాడు.

అయితే తిరుపతి మద్యానికి బానిసై నిత్యం బార్యతో గొడువ పడే వాడని గత రాత్రి రోజు లాగే గొడవ పడడంతో బార్య సౌందర్య అత్త లక్ష్మిలు కలిసి రోకలి బండ తో తలపై బలంగా కొట్టడంతో తిరుపతి అక్కడి అక్కడే మృతి చెందాడు. అనంతరం ఇరువురు కలిసి తిరుపతి మృతు దేహాన్ని తిరుపతి స్వ గ్రామమైన ఎర్ర గుంటపల్లి గ్రామంలోని తన ఇంట్లో పడవేసి వెళ్ళారు విషయాన్ని గమనించిన మృతిని అన్న మడక సమ్మయ్య పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు సీఐ వాసుదేవ్ రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement