Saturday, May 4, 2024

పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం – ఇద్ద‌రు కార్మికులు దుర్మ‌ర‌ణం..

విశాఖపట్నం పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాద్రి ఎన్టీపీసీలో ఎఫ్ జీడీ నిర్మాణ పనులు జరుగుతుండగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేబుల్ ట్రాక్ బెల్ట్ తెగిపోవడంతో 15 మీటర్ల ఎత్తు నుంచి నిర్మాణ కార్మికులు కిందపడిపోయారు.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్ కు చెందినవారిగా గుర్తించారు. ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement