Tuesday, May 7, 2024

ఇరువర్గాల ఘర్షణ – ఒకరి మృతి .. 9 మందికి గాయాలు

అనంతపురం సెప్టెంబర్ 20సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగిల్లు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ.. ఒకరు మృతి, 9 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితేముదిగుబ్బ మండలం దొరిగిల్లులో అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో అనంతయ్య మృతి చెందగా, మరో 9 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దొరిగిల్లు క్వార్టర్స్ వద్ద వినాయకుని మండపం వద్దకు నలుగురు యువకులు బైక్ పై విన్యాసాలు చేయడం.. ఘర్షణకు దారీ తీసిందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement