Monday, May 6, 2024

ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి..

తెలుగు రాష్ట్రాల్లో వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ఎండలు మండిపోతున్నాయి. ఎండలు పెర‌గ‌డంతో ఎండ‌వేడిమిని త‌ట్టుకోలేక జ‌నం ప్రాణాలు కోల్పోతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇప్ప‌టికే 11మంది వ‌డ‌దెబ్బ‌తో చ‌నిపోగా.. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో మ‌రో ఇద్ద‌రు మృతిచెందారు. జిల్లాలోని ద‌ర్శి, కొర్ల‌మ‌డుగులో ఇద్ద‌రు వ‌డ‌దెబ్బ‌తో చ‌నిపోయారు. స్పృహ త‌ప్పిపోయి కింద‌ప‌డ‌డంతో వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఏపీలో వడదెబ్బతో చనిపోయిన వారి సంఖ్య 13కు చేరింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement