Tuesday, May 7, 2024

AP | సిద్ధం సభలో అపశ్రుతి.. ఇద్దరు మృతి..

బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం జరిగిన వైఎస్సార్‌సీపీ సిద్ధం సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకునే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒంగోలు నగరపాలక సంస్థకు చెందిన పారిశుధ్య కార్మికుడు ఉదరగుడి మురళి(30) మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బస్సులో నుంచి జారిపడి మరో యువకుడు మృతి..

ఈ సభకు వెళ్లి వెళ్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మలుపు వద్ద బస్సు నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గగా గుర్తించారు. సభ నుంచి తిరిగి వస్తుండగా బస్సు ముందు తలుపు వద్ద నిలబడిన బాలదుర్గ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. బస్సు వెనుక చక్రాలు అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మరోవైపు సభలో ఓ ఏఎస్ఐకి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement