Monday, May 20, 2024

AP | కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో పవన్ కల్యాణ్‌ భేటీ

మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు బీజేపీతో పొత్తు కుదుర్చుచున్నారు. కాగా, టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ ఆదివారం విజయవాడ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా షెకావత్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు సమాచారం. ఇందులో బీజేపీకి 6 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement