Thursday, May 9, 2024

Breaking: ఆర్టీసీ బస్సు – బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు మృతి

నందికొట్కూరు, (ప్రభ న్యూస్): కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల అంచె వద్ద ఇవ్వాల‌ తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ప‌ర‌స్ప‌రం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో వెళ్తున్న డ్రైవర్ స్వామి రెడ్డి, మరొకరు అక్కడికక్కడే చ‌నిపోయారు.

మృతులు కోసిగి మండలానికి చెందిన‌వారిగా తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న బ్రాహ్మణకొట్కూరు ఎస్ ఐ ఓబులేషు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement