Wednesday, May 1, 2024

గుంటూరులో అర్ధరాత్రి రెండు దారుణ హత్యలు..

గుంటూరు నగరంలో ఒక్కసారిగా రెండు దారుణ హత్యలు జరగడంతో గుంటూరు మహా నగర ప్రజలు ఉలిక్కి పడ్డారు. అరండల్ పేటలోని లిక్కర్ మార్ట్, అమరావతి రోడ్డులోని యమహా షోరూం వాచ్ మెన్లను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అమరావతి రోడ్ లో గల యమహా షోరూం నందు వాచ్ మెన్ శ్రీరామ్ కృపానిధి (65)ను హత్య చేశారు. అలాగే మరో వాచ్ మెన్ ను దొంగలు హత్య చేసి పరారయ్యారు. దోపిడీ దొంగల బీభత్సంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు డిఐజి త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ అరీఫ్ హఫీజ్, డీఎస్పీ, సిఐ లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement