Saturday, May 4, 2024

సముద్రంలో ఇద్దరు బాలురు గల్లంతు

చీరాల, ఏప్రిల్ 13(ప్రభ న్యూస్ ): రామాపురం సముద్ర తీరంలో సరదాగా ఈత కొడదామని సముద్రంలోకి వెళ్లి ఇద్దరి బాలురు గల్లంతైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తెలిసిన వివరాల మేరకు గంజి పాలెం చెందిన ఇద్దరు బాలురు బుధవారం సరదాగా గడుపుదామని రామాపురం సముద్రతీరానికి వెళ్లారు. సముద్రంలోకి వెళ్ళిన బాలురు గల్లంతయ్యారు. గంజి పాలెంకు చెందిన ఇర్ఫాన్(15), రెహమాన్(15) సముద్రo లో కి వెళ్లగా బుధవారం అర్ధరాత్రికి ఇర్ఫాన్ మృతదేహం ఒడ్డుకు చేరగా రెహమాన్ కోసం ఈపూరుపాలెం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement